VKB: కొడంగల్ వ్యాప్తంగా రేపటి నుంచి హోలీ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. హోలీ సంబరాల్లో రసాయనిక రంగులు వినియోగించ వద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు రసాయనాల వల్ల తాత్కాలిక కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని, సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే పూలతో రంగులు తయారుచేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.