WNP: ప్రజల్లో అవగాహన కల్పించి ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని పాలెం గ్రామ సర్పంచ్ నీరజ, మోజర్ల ఉద్యాన కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారిని బేబీ రాణి అన్నారు. కొత్తకోట మండలం పాలెంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా గ్రామంలో ఎయిడ్స్ నివారణపై నాటక ప్రదర్శన చేశారు. అనంతరం ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు.