MHBD: డోర్నకల్ మండలంలోని అమ్మపాలెం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై నేడు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారిని సరిత, ఆత్మ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారించాలని, పంటల సాగులో మెలకువలను పాటించి అధిక దిగుబడిలను పొందాలని అన్నారు.