NLG: చిట్యాల మండలం ఏపూరుకు చెందిన మాధగోని వంశీ (23) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హైదరాబాద్లో మెకానిక్గా పనిచేసే వంశీ గ్రామానికి వచ్చిన సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం HYD లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీని ఆదుకోవాలని, దాతలు ఆర్థిక సాయం చేయాలని మిత్రులు విజ్ఞప్తి చేశారు.