KNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను టీఎన్జీవోస్ భవన్లో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని టీఎన్జీవోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.