NZB: నవీపేట్ మండల పరిధిలోని ఫకీరాబాద్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని గంజిగావ్ నుంచి నిజామాబాద్కు ఇసుక తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.