WNP: శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసిత నిరుద్యోగి కురుమన్న మృతి పట్ల మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, కురుమన్న మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.