ICC ఛైర్మన్ జయ్ షా నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027లో జరగనున్న మహిళల మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను సవరించి, ఆ టోర్నీని ఫిబ్రవరి 14-28 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, 2028లో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో.. భారత్ తన మ్యాచ్లను తటస్థ వేదికల్లో ఆడటానికి ఐసీసీ అంగీకారం తెలిపింది.