సౌత్ ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్(SAFF) U20 ఛాంపియన్షిప్ మ్యాచ్లో పాక్ను టీమిండియా చిత్తుచేసింది. మన ప్లేయర్లు విశాల్ యాదవ్ 1, ఓమాంగ్ డోడమ్ 2 గోల్స్ చేయడంతో పాక్ 0-3తో ఓడింది. ముందుగా బంగ్లా, తర్వాత భారత్ చేతిలో ఓడిన పాక్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-B నుంచి బంగ్లా, భారత్ సెమీస్కు చేరగా.. అగ్రస్థానం కోసం రేపు ఇరుజట్లు ఢీకొననున్నాయి.