GNTR: పేద పిల్లలకు ఉచిత విద్య అందించే ఆర్టీఈ ప్రవేశాల్లో ఈసారి గణనీయ వృద్ధి కనిపించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 2,487 మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో గుంటూరులోనే 1,708 మందికి అవకాశం దక్కిందని తెలిపారు. లాటరీ విధానంలో ఎంపిక చేసి, ఫీజులను ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు.