TG: సంగారెడ్డిలో రామ్ మందిర్ ఆలయానికి రూ.2.50 కోట్ల విలువ చేసే అభరణాలను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించారు. శ్రీరామనవమి సందర్భంగా జగ్గారెడ్డి, నిర్మల దంపతులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా వారి ఇంటి వద్ద నుంచి ఆభరణాలు తీసుకుని వెళ్లి ఆలయంలో సమర్పించారు. రంగపేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో సీతారాముల కళ్యాణం జరగుతోంది.