GNTR: జిల్లాలో పేదలకు ఉచిత చికిత్స అందించే NTR వైద్యసేవ పథకం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వైద్యసేవలు కొనసాగేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, ఆసుపత్రి సంఘాల మధ్య చర్చలు కొనసాగుతుండగా, త్వరలోనే సేవలు పునఃప్రారంభం అవుతాయన్నారు.