SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు ఆలయ ప్రాంగణంలో టెక్కలి ఈవో మనస్విని ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు గురువారం జరిగింది. 53 రోజులకు గాను రూ. 7,67,176ల ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.