కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం బయానా గుట్ట సమీప వాగులో జాలర్లకు వలలో వింత చేప చిక్కింది. ఇది సాధారణ చేపల కంటే భిన్నంగా ఉండటంతో ఇది ఏ జాతికి చెందినదో గుర్తించలేకపోతున్నారు. అరుదైన ఈ చేపను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అరుదైన జాతి చేపగా భావిస్తున్నారు. ఇలాంటి చేప కనిపించడం ఇదే మొదటిసారని తెలిపారు.