సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సీతారాములవారి కళ్యాణోత్సవంలో ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు.