VKB: బంట్వారం మండల కేంద్రంలో అండర్ డ్రైనేజ్ పైప్లైన్ పనుల కోసం తవ్విన మట్టి, రాళ్లు కొంతకాలంగా రోడ్డుపై పేరుకుపోయి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యను గమనించిన మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, స్వయంగా ముందుండి మట్టి, రాళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో రహదారి సాఫీగా మారి వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.