PPM: బలిజిపెట మండలం బర్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఎర్ల రాంబాబు శాస్త్రి సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేశారు. గ్రామంలో చిన్నలు, పెద్దలు అందరూ పాల్గొని జైశ్రీరామ్ జైశ్రీరామ్ నినాదాలు గ్రామంలో మారుమోగాయి. కళ్యాణం అనంతరం గ్రామంలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెద్దలు తెలిపారు.