వరుసగా 2 మ్యాచుల్లో గెలిచి విజయోత్సాహంతో ఉన్న చెన్నై జట్టుకు భారీ షాక్ తగిలింది. KKRతో మ్యాచులో గాయపడిన పేసర్ ఖలీల్ అహ్మద్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతను గాయం నుంచి కోలుకోవడానికి 10-12 వారాలు పడుతుందని వైద్యులు సూచించనట్లు సమాచారం. అటు గాయంతో టోర్నీలో ఇంకా ఆడలేకపోయిన ధోనీ ఎల్లుండి SRHతో మ్యాచ్కూ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.