TG: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించి శుభ్రత, నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ రికార్డులను పరిశీలించి.. అమ్మవారికి చెందిన డిపాజిట్లు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను తెలుసుకున్నారు.