TG: మాజీమంత్రి KTR జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. BRS పదేళ్లలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారని ప్రశ్నించారు. మంత్రి కాన్వాయ్పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించారని విమర్శించారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు.