AP: అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. కాసేపట్లో శాసనసభ ప్రారంభం కానుంది. సెజ్ నిర్వాసితులకు నష్టపరిహారం, ఆహార కల్తీ, గోదావరి జిల్లాల్లో పురాతన దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే, మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2026-27 బడ్జెట్కు, VAT సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది.