TG: నిజామాబాద్(D) ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. మద్యం, గంజాయికి బానిసైన కుమారుడు భానుప్రకాష్ను తండ్రి కిషన్ గొడ్డలితో నరికి చంపాడు. కొడుకు వ్యసనాలతో విసిగిపోయిన తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కిషన్ నేరుగా ఇందల్వాయి PSకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.