AP: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలి. మనకు డబ్బు సమస్య కాదు.. ఆలోచనా విధానమే ముఖ్యం. మీ పరిధిలో ఉన్న విషయాల్లో తప్పు చేయకుండా ముందుకెళ్లాలి. ఇంటా, బయటా చిన్న చిన్న సమస్యలు వచ్చాయని వెనక్కి తగ్గవద్దు. ఇప్పుడు ప్రతి పథకం మహిళల పేరుతోనే ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.