TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తుతో పాటు సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.