జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద ఏప్రిల్ 10 నుంచి నగదు చెల్లింపులను నిలిపేయనుంది. ఫాస్టాగ్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ను అతికించకపోతే UPI విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించవచ్చు. కానీ, 1.25 రెట్లు అధికంగా టోల్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది.