AP: భారత్లో పాక్షిక చంద్రగ్రహణం పూర్తికావడంతో తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు మహాద్వారం, గర్భాలయ తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ శుద్ధి పుణ్యాహవచనం అనంతరం 8:30 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:47 గంటలకు పూర్తయింది.