AP: శ్రీకాకుళం జిల్లాకేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. 24 గంటల్లోనే 19 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ముఖ్యంగా కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగువారి తోట తదితర ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలను సమీక్షించారు.