TG: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో రాపల్లికి చెందిన ఇంటర్ MPC ఫస్టియర్ విద్యార్థి అక్షంత్ గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఇవాళ వెలువడ్డ ఫలితాల్లో 347 మార్కులతో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.