TG: బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు ఎంతో కీలకమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ సమాజంలో మార్పు ప్రారంభమైందని.. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం సమాజం మొత్తం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.