భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. మే 15 నుంచి 20వ తేదీ వరకు నాలుగు దేశాల్లో పర్యటించనున్నారు. నార్వేలో భారత్-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. ముందుగా నార్వేలో పర్యటించిన అనంతరం స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలను సందర్శిస్తారు.