KDP: టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఖాజీపేటలోని అన్ని జిరాక్స్ సెంటర్ల యజమానులకు ఆదివారం పోలీస్ స్టేషన్లో SI వంశీధర్ సమావేశం నిర్వహించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లేదా ఎలాంటి పరీక్షా మెటీరియల్ జిరాక్స్ తీయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్ యజమానులు నిబంధనలు పాటించాలన్నారు. నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.