మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఛానల్ జీ తెలుగులో మార్చి 22న సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం టెలికాస్ట్ కానుంది. మరి బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.