వనపర్తి జిల్లాల్లో గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి చేపట్టిన ధర్నా 77వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరానికి రోజురోజు ప్రజాదరణ ఉందని అన్నారు. ప్రజా ఆమోదం లేకుండా రైతుల భూములను లాక్కోవడం అన్యాయమని, ఏదుల రిజర్వాయర్ అందుబాటులో ఉండగా కొత్త రిజర్వాయర్ల అవసరం లేదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.