BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.