VKB: కుల్కచర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లికి చెందిన వడ్డే రమేశ్(22) అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.