AP: సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. హెచ్.వడ్రహట్టి గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తల్లీకూతురు సుబ్బమ్మ, లక్ష్మీ అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ వివాదాల కారణంగానే వారంతా అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.