AP: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసులో పురోగతి లభించింది. ట్యూషన్కు వెళ్లకుండా మేరారామ్(12), ఉమారామ్ (13) డబ్బులు తీసుకుని ఆటోలో బస్టాండ్కు వెళ్లినట్లు సమాచారం. నిన్న విజయవాడ బస్టాండ్ నుంచి ముంబై వెళ్లారు. పిల్లలు గుజరాత్లోని సూరత్కు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. పిల్లలను క్షేమంగా తల్లిదండ్రలకు అప్పగించారు.