AP: విశాఖలోని గాజువాకలో మౌనిక హత్యకేసు నిందితుడు రవీంద్రపై మృతురాలి బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. హత్య జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితుడిని తీసుకురాగా, ఆగ్రహించిన బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పోలీసులు అతికష్టమ్మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చి నిందితుడిని అక్కడి నుండి తరలించారు.