ఇరాన్ నిఘా శాఖలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందారు. ఆ ఇద్దరు అధికారులను తామే చంపినట్లు ఇజ్రాయెల్ రక్షణదళాల ట్వీట్ చేశాయి. నిఘా శాఖ సహాయమంత్రి సయ్యద్ యాహ్యా హమీద్, ఇరాన్ గూఢాచర్య విభాగ అధిపతి జలాల్ పోర్ హుస్సేన్ మృతి చెందారు. కాగా, ఇజ్రాయెల్ ఇలాంటి రహస్య ఆపరేషన్లపై మౌనంగా ఉంటుంది. కానీ ఈసారి బహిరంగంగా ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.