TG: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని CPI మద్ధతుతో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఛైర్పర్సన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్పర్సన్గా సీపీఐ అభ్యర్థి సరితను ఎన్నుకున్నారు. క్యాతనపల్లి ఛైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. కాగా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.