భారత స్వాతంత్ర్యోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ ఓ ధృవతార. అజేయ సాహసానికి, దేశభక్తికి నిలువుటద్దం. 15 ఏళ్ల వయుసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. న్యాయస్థానంలో పేరు అడిగితే ‘ఆజాద్(స్వేచ్ఛ)’, అని తన తండ్రి ‘స్వతంత్ర’ అని గంభీరంగా సమాధానమిచ్చారు. ప్రతి కొరడా దెబ్బకూ ‘వందేమాతరం’ అన్న నినాదంతో నాటి బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు.