TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో అడవి జంతువుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కనకగిరి, పులిగుండాల పరిసర ప్రాంతాల్లో చిరుత పులితో పాటు ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.