కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లోని అద్దాల తలుపులు, కిటికీలపై ‘X’ గుర్తును గమనించే ఉంటారు. అద్దాలు పారదర్శకంగా ఉండటం వల్ల కార్మికులు వాటిని గుర్తించలేరు. నిచ్చెనలు, ఇనుప రాడ్లతో వెళ్తున్నప్పుడు పొరపాటున ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు హెచ్చరికగా ‘X’ గుర్తు వేస్తారు. నిర్మాణం పూర్తికాగానే ఈ టేపును తొలగిస్తారు. ఇది కార్మికుల భద్రత కోసం మాత్రమే.