AP: శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మహిళలకు రూ.1500 ఇచ్చే స్త్రీ నిధి పథకం ఏమైందని వైసీపీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా MLC వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఒక్కొక్కటిగా అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.