VSP: సింహాచలం వరాహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు.