ELR: చింతలపూడిలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం రాజ్యాంగ రచయితగా మాత్రమే కాకుండా, విద్యాభ్యాసంలోను, దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.