E.G: కోరుకొండలో బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇవాళ ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని భారతదేశంలో ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకుంటారన్నారు. సామాజిక న్యాయం, మహిళా హక్కులు & కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి ఈ రోజు చిహ్నంగా నిలుస్తుందన్నారు.