మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అణు జలాంతర్గామి వద్ద ఉన్న ఫొటోను ఫ్రాన్స్ రాయబార కార్యాలయం విడుదల చేసింది. అంతేకాకుండా, మధ్యధరా సముద్రంలోకి చార్లెస్ డీ గల్లె యుద్ధనౌకను పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ కదలికలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.