పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. కానీ, ఇదొక ఆచారంగా వస్తోంది. దైవ దర్శనం వల్ల కలిగిన ప్రశాంతతను, దివ్యానుభూతిని కోల్పోకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇతర ఇళ్లకు వెళ్తే ప్రాపంచిక విషయాల వల్ల ఆ భక్తిభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ అనుభూతిని పదిమందికి పంచాలని పెద్దలు చెబుతుంటారు.