ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించనున్న సినిమా ‘జై హనుమాన్’. ఈ మూవీ కోసం రిషబ్ రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ + లాభాల్లో వాటాను తీసుకోనున్నట్లు టాక్. దీనివల్ల నిర్మాతలపై భారం తగ్గడమే కాకుండా, సినిమా బ్లాక్ బస్టర్ అయితే రిషబ్కు భారీ లాభం చేకూరుతుంది. ఒకవేళ ఈ చిత్రం రూ.600 కోట్లు వసూలు చేస్తే, వాటాల రూపంలో ఆయనకు ఏకంగా రూ.150 కోట్లకుపైగా వచ్చే అవకాశం ఉందట.